రెండు రోజుల పాటు హస్తినలోనే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు ఆయన హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం ఇవాళ చిత్తూరులో పర్యటిస్తారు.. అక్కడ విజయ డైరీ పునరుద్ధరణలో భాగంగా అమూల్ సంస్థ ఏర్పాటుచేసే కొత్త యూనిట్కు భూమి పూజ చేస్తారు. అలాగే క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు.ఈ నెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్ హస్తినలోనే ఉంటారు. 5వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ (ూఎ చీaతీవఅసతీa వీశీసఱ)తో.. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Aఎఱ్ ూష్ట్రaష్ట్ర) తో భేటీ అవుతారు. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఏపీకి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, పెండింగ్లో ఉన్న అంశాలు, సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. ఈ నెల 6న ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి వస్తారు.ప్రధానితో భేటీలో మరికొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులకు వైఎఎస్సార్సీపీ మద్దతు కోరే ఛాన్స్ ఉందంటున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రానికి మద్దతు కావాల్సి అనివార్యం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది.ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే జిల్లాల పర్యటనల్లో బిజీకానున్నారు సీఎం జగన్. ఈ నెల 7,8న సీఎం జగన్ సొంత జిల్లాలో పర్యటిస్తారు. సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. జులై 8న దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి కావడంతో ఇడుపులపాయ వెళ్తారు.. అక్కడ నివాళులు అర్పిస్తారు. అంతేకాదు అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని నిర్వహించనుంది. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో నిర్వహించనున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. వాతావరణ బీమా, ఫసల్ బీమా నిధులను రైతుల ఖాతాలకు జమ చేస్తారు. ఈ వారం మొత్తం ముఖ్యమంత్రి జగన్ వరుస పర్యటనలతో బిజీ, బిజీగా గడపనున్నారు.