Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రాష్ట్రాభివృద్ధే నా లక్ష్యం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశుని దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని.. 93 శాతం స్ట్రైక్ రేట్ గతంలో ఎప్పుడూ రాలేదన్నారు చంద్రబాబు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారన్నారు. తాను ఏ కార్యం చెయ్యాలన్నా ముందుగా తన కుల దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మన రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించే విధంగా ముందుకు వెళ్తాం అని చంద్రబాబు చెప్పారు. పేదరికంలేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తా. ఆర్థిక అసమానతలు లేని విదంగా చర్యలు చేపడుతాం. టీటీడీతోనే ప్రక్షాళన ప్రారంభం అవ్వాలి. నా పర్యటనలోనూ పరదాలు కడుతున్నారు. టీటీడీలో పెద్ద ఎత్తున్న అవకతవకలు జరిగాయి. జనాలనూ నా దగ్గరకు రానివ్వకుండా కర్ఫ్యు వాతావరణం సృష్టించారు. నా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ల క్రితమే వాళ్ళకి వ్యాపారం పెట్టించా. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చా.. నా పిలుపు మేరకు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. శ్రీవారి సమక్షంలో చెబుతున్నా.. నేను 5కోట్ల ప్రజల మనిషిని. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ 5 ఏళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు అని అన్నారు.

ఇక ప్రజా పాలన షురూ..

రాష్ట్రంలో ఇకపై పరదాలు, నియంత్రణ వుండదు. నేటి నుంచి ప్రజా పాలన ప్రారంభం అయ్యింది. గత 5 ఏళ్లలో జరిగిన నష్టం అపారం. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. 2047 నాటి భారత్ ప్రపంచంలోనే మొదటి రెండు స్థానాల్లోకి వస్తుంది. 2047 విజన్‌తో ముందుకు వెళ్తా. ఏపీ దేశంలోనే నెంబర్ 1న రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలి. దురదృష్టం వల్ల అమరావతి, పోలవరం పడకేసింది. ఈ రెండింటిని అభివృద్ధి చెయ్యాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్య క్షేత్రం. తిరుమలని అపవిత్రం చెయ్యడం భావ్యం కాదు. తిరుమలని ప్రక్షాళన చేస్తా. దేశం గర్వపడేలా ప్రక్షాళన జరుగుతుంది. మంచిని ప్రోత్సహిస్తా.. రౌడీయిజాన్ని అణచి వేస్తా అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img