Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపే ప్రయత్నం చేస్తున్నారు

పోలవరం పనుల పురోగతిపై సమీక్షలో సీఎం జగన్

పోలవరం ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలను విపత్తుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన జగన్.. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాళీలు వదిలేశారని.. వరద ప్రవాహం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జగన్ వివరించారు. డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీని వల్ల ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం కొన్ని మీడియా సంస్థలకు కనిపించలేదు. ఎందుకంటే.. వారి బంధువులకే నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారు. ప్రాజెక్టు స్ట్రక్షర్‌తో ఏమాత్రం సంబంధం లేనిది గైడ్ వాల్. ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపే ప్రయత్నం చేస్తున్నారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను త్వరగా పూర్తి చేయాలి. ఇది పూర్తయితే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంది అని స్పష్టం చేశారు.డిసెంబర్ కల్లా డయాఫ్రమ్‌ వాల్ పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇటు పోలవరం నిర్వాసిత కుటుంబాలకు సాయంపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పునరావాస కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలన్నారు. 12,658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు చెప్పారు. పోలవరాన్ని టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సూచించారు. పోలవరం వద్ద బ్రిడ్జిని నిర్మించాలని.. పర్యాటకులు ఉండేందుకు హోటల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img