Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఇక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలోకి మహిళలు

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రప్రభుత్వం
మహిళలకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీయే)లోకి ఎంట్రీ ఇవ్వడంతోపాటు శాశ్వత కమిషన్‌ ఇవ్వడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం.బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మంగళవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. ఆ దిశగా విధాన రూపకల్పన ప్రక్రియను రూపొందించనున్నట్లు తెలిపారు. త్రివిధ దళాధిపతులు ఈ నిర్ణయం తీసుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, వాళ్లను ఒప్పించిన ఘనత మీకే దక్కుతుంది అని జస్టిస్‌ కౌల్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img