Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఉత్తరాఖండ్‌లో భూకంపం

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 5.58 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా నమోదయ్యిందని, జోషిమఠ్‌కు 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపల్‌కోటి వద్ద భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. తాజాగా భూకంపం సంభవించిన సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా ఈ భూకంప ప్రభావం చుట్టుపక్కల రాష్ట్రాలపైనా కనిపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img