మాజీ సీఎం సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, బీజేపీ ఏం చేసినా ఇక అధికారాన్ని నిలబెట్టుకోలేదని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. ఏ పార్టీతో, ఇండిపెండెంట్స్లో పొత్తు అవసరం లేకుండా కాంగ్రెస్ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను దాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఎన్నికల కౌంటింగ్ మొదలైన అనంతరం ప్రాథమిక ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 115కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. అధికార బీజేపీ లీడ్ 80 స్థానాలకు లోపలే ఉన్నది. ఈ నేపథ్యంలో యతీంద్ర సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారమని ధీమాగా చెప్పారు. కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసం మా తండ్రి సిద్ధరామయ్యే మరోసారి ముఖ్యమంత్రి కావాలని యతీంద్ర తన అభిప్రాయాన్ని వెల్లడించారు.