Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాదో చిన్న పార్టీ.. నాకు డిమాండ్ లేదు : కుమార‌స్వామి

క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. తాజా స‌మాచారం మేర‌కు కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొన‌సాగుతోంది. అయితే కీల‌కంగా మార‌నున్న జేడీఎస్ కూడా మెరుగ్గా రాణిస్తోంది. ఈ నేప‌థ్యంలో జేడీఎస్ పార్టీ నేత హెచ్‌డీ కుమార‌స్వామి(నణ ఖబఎaతీaంషaఎవ) మాట్లాడారు. త‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కాంటాక్ట్ కాలేద‌న్నారు. త‌న‌కు డిమాండ్ లేద‌ని, త‌న‌దో చిన్న పార్టీ అని కుమార‌స్వామి అన్నారు. రాబోయే 2-3 గంట‌ల్లో క్లారిటీ వ‌స్తుంద‌ని, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్టీలే భారీగా స్కోర్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో మంచి అభివృద్ధి సాగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు కుమారస్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img