Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

టౌన్ ఫస్ట్ సాధించిన నిత్యశ్రీ అనే విద్యార్థిని అభినందించిన డీఈవో మీనాక్షి దేవి

విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలను పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ స్కూలుకు చెందిన నిత్యశ్రీ అనే విద్యార్థి 594/600 మార్కులు సాధించి పట్టణంలోని ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం పట్ల డిఇఓ మీనాక్షి దేవి ధర్మవరం చేరుకొని, ఆ పాఠశాలకు వెళ్లి, ప్రత్యేకంగా నిత్యశ్రీ అనే విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశా రు. డీఈవో మాట్లాడుతూ నిత్యశ్రీ యొక్క తండ్రి రమేష్ చిరు వ్యాపారస్తుడని తల్లి కస్తూరి గృహిణి అని, వీరు తమ కుమార్తెను ఎంతగానో ప్రోత్సహించడం, పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధను కనపరచడం వల్లనే టౌన్ ఫస్ట్ సాధించడం సాధ్యమైందని తెలిపారు. నిత్యశ్రీ భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని వారు ఆశీస్సులను అందించి మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సెట్టిపీ నిర్మల జయచంద్రారెడ్డి, డైరెక్టర్లు సెట్టిపిసూర్య ప్రకాష్ రెడ్డి, శెట్టిపి పద్మ తదితరులు పాల్గొని మరోసారి నిత్యశ్రీ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img