Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌..! కౌంటింగ్‌ వేళ శశిథరూర్‌ తీవ్ర ఆరోపణ

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఢల్లీి ఏఐసీసీ కార్యాలయంలో చురుగ్గా జరుగుతోంది. ఈ సమయంలో అధ్యక్ష ఎన్నికల అభ్యర్ది శశిథరూర్‌ సంచలనం రేపారు. ఇప్పటివరకూ ఎన్నికల్లో అధిష్టానం పక్షపాతం లేకుండా ఇద్దరు అభ్యర్ధుల్ని సమానంగానే చూసిందని, ఎన్నికలు సజావుగానే జరిగాయని చెప్పుకుంటూ వస్తున్న థరూర్‌.. అకస్మాత్తుగా సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్‌ ఎన్నికల ఏజెంట్‌ సల్మాన్‌ సోజ్‌ ఇవాళ కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూధన్‌ మిస్త్రీకి లేఖ రాశారు. ఇందులో పలు ఆరోపణలు చేశారు.యూపీలో అధ్యక్ష ఎన్నికల నిర్వహణలో చాలా తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. యూపీలో పోలైన ఓట్లు చెల్లనవిగా ప్రకటించాలని ఆయన కోరారు. దీంతో ఈ వ్యవహారం కౌంటింగ్‌ వేళ కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img