Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తగ్గిన కొత్త కేసులు..కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో కొద్ది వారాలుగా పదివేలకు దిగువనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7992 కరోనా కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే 6 శాతం మేర తగ్గాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, కరోనా బారినపడి 4,75,128 మంది మృతిచెందారు. ప్రస్తుతం 93,277 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 559 రోజుల్లో యాక్టివ్‌ కేసులు ఇంత తక్కువకు చేరుకోవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కాగా, గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 398 మంది బాధితులు మరణించారని, 9265 మంది కరోనా నుంచి బయటపడ్డారని తెలిపింది. ఇప్పటివరకు 131.99 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img