Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో (గురువారం) కేసుల సంఖ్య రెండు లక్షలకు దిగువగానే నమోదైంది. దేశంలో కొత్తగా 1,49,394 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చుకుంటే (23 వేల కేసులు) 13% శాతం కేసులు తగ్గాయి. దీంతోపాటు.. 1072 మంది మృతి చెందారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో నమోదైన మరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటుండంతో మరణాల సంఖ్య గణాంకాల్లో ఎక్కువగా నమోదవుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 2,46,674 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,35,569 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 5,00,055 బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 168.47 కోట్ల మంది టీకా తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img