Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మరో 4,40,752 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. నిన్న నమోదైన కేసుల్లో కేరళలో 26,701 కరోనా కేసులు నమోదు కాగా.. 74 మంది మరణించారు. దేశవ్యాప్తంగా నిన్నటివరకు 53,14,68,867 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. ఇందులో ఆదివారం 14,10,649 మందికి పరీక్షలు చేశామని తెలిపింది. కాగా.. ఇప్పటివరకు దేశంలో 68,75,41,762 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img