సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ
మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, సమ్మె విరమింప చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మంగళవారం లేఖ రాశారు. గత మూడేళ్లుగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేద,.కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన పారిశుధ్య కార్మికుల సమస్యలు విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని లేఖలో పేర్కొన్నారు. అసలే వానాకాలం వల్ల పారిశుధ్యం లోపించి వ్యాధులు వ్యాపించి, అనారోగ్య పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు.మున్సిపల్ కార్మికుల హెల్త్ అలవెన్స్ బకాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన పనికి సమాన వేతనం, సిబ్బందిని పెంచడం వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రామకృష్ణ లేఖలో డిమాండ్ చేశారు.