ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లపై దృష్టి పెట్టినప్పుడు ఆధునిక మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో జరుగుతున్నది ఇదేనని అన్నారు. దేశ రాజధాని నగరం ఢల్లీిలోని కస్తూర్బా గాంధీ మార్గ్లో డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్లను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్లో అన్ని రకాల ఆధునిక సదుపాయాలు ఉన్నాయని, ఆధునిక సదుపాయాలు కలిగిన పని పరిస్థితుల్లో మరింత మెరుగ్గా పని చేయడానికి త్రివిధ దళాలకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్ల నిర్మాణం 12 నెలల్లో పూర్తయిందన్నారు.సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం కూడా నిర్ణీత సమయంలోనే పూర్తవుతుందని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ్త నరేంద్ర మోదీ విమర్శలు గుప్పిస్తున్నవారిని ఉద్దేశిస్తూ, ఈ ప్రాజెక్టులో రక్షణ రంగ కార్యాలయాల సముదాయం కూడా ఉందనే విషయాన్ని వీరు ఎప్పుడూ ప్రస్తావించలేదన్నారు. దీనిని ప్రస్తావిస్తే తమ బండారం బయటపడిపోతుందని వారికి తెలుసునని చెప్పారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాలతోపాటు, సాధారణ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.