విశాలాంధ్ర`గుంటూరు వైద్యం: స్థానిక రెడ్డిపాలెం డే స్కాలర్ శ్రీచైతన్య విద్యార్థులు గత ఏప్రిల్లో నిర్వహించిన ఐఎన్ టీఎస్ఓ ఒలంపియాడ్లో 11మంది విద్యార్థులు బంగారు పతకాలు, ఆరుగురు కన్సోలేషన్ బహుమతులు, 19మంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారని రెడ్డిపాలెం శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపల్ పద్మజ తెలిపారు. ఈ మేరకు ఒలంపియాడ్ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య కళాశాలల ఎంజీఎం నూతలపాటి అంజయ్య విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ అభినందన సభలో కళాశాల డీన్ రవీంద్ర, ఏఓ రామారావు, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.