Friday, April 26, 2024
Friday, April 26, 2024

మంచినీళ్ల సూర్యనారాయణ చిత్రపటానికి సీపీఐ నాయకుల నివాళి

విశాలాంధ్ర`తాడేపల్లి : భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకులు, కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్‌ మంచినీళ్ల సూర్యనారాయణ సంస్మరణ సభ గురువారం కుంచనపల్లి వారి నివాసం వద్ద జరిగింది. ముందగా కామ్రేడ్‌ సూర్యనారాయణ చిత్రపటానికి సీపీఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాశయ్య, సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య, శీలం అనిల్‌, కంచర్ల శివయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కంచర్ల కాశయ్య మాట్లాడుతూ కామ్రేడ్‌ మంచినీళ్ల సూర్యనారాయణ ఆదర్శప్రాయుడని తన జీవిత చరమాంకం వరకు సీపీఐ అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ సీపీఐ జెండాని వీడలేదని అన్నారు. సుదీర్ఘకాలం తాలూకా సమితి సభ్యులుగా ఉన్నారని తన శక్తివంచన లేకుండా సీపీఐ అభివృద్ధి కోసం నిలబడిన వ్యక్తి సూర్యనారాయణ అని కొనియాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img