బ్రోచర్ ఆవిష్కరించిన కలెక్టర్
విశాలాంధ్ర ` బాపట్ల : నిరుద్యోగ యువత కోసం ఈనెల 16వ తేదీన అద్దంకి మండలం సింగరకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్స్ ను సోమవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో ఆమె విడుదల చేశారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని అన్నారు. 12 బహుళ జాతి కంపెనీలు ఉద్యోగమేళాలో పాల్గొంటాయన్నారు. ఆయా కంపెనీలలో ఖాళీగా ఉన్న 825 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉద్యోగమేళా జరుగుతుందన్నారు. ఏపీ ఎస్ ఎస్ డి సి, సిడాప్, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నామన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బిటెక్, బి.ఎస్.సి., ఏం.ఎస్.సి., బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఏదేని డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్లు వంటి విద్యార్హతలు ఉన్నవారు అర్హులని ఆమె తెలిపారు. ఉద్యోగాలు పొందగోరే నిరుద్యోగులు ముందుగా ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె చెప్పారు. నిరుద్యోగుల కొరకు https://forms.gle/dhmhNEjDjwc7cFNa8 వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇతర సమాచారం కొరకు సెల్ నెంబర్ రవికిరణ్ 8978886348, గోపినాథ్ 9440635677 లను సంప్రదించాలని ఆమె అన్నారు.