విశాలాంధ్ర ` బాపట్ల : గూడు కోసం యద్దనపూడి మండలం యనమదల గ్రామానికి చెందిన వృద్ద దంపతులు పల్లెపోగు ఎమేలమ్మ దేవయ్యలు కలెక్టర్ బాట పట్టారు. మా రక్త సంబంధీకులు, కుటుంబీకులు బంధువులు మా గుడిసెను సైతం నిప్పు పెట్టి కాల్చివేశారని మేము రోడ్డున పడ్డామని మా కుటుంబీకుల నుంచి ప్రాణరక్షణ కల్పించి గూడు ఏర్పాటు చేయించాలని కోరుతూ కలెక్టర్ విజయకృష్ణన్కు వినతిపత్రం ఇచ్చారు. గూడు ఏర్పాటు చేయాలంటూ రాబంధువుల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతూ ప్లెక్లీతో వృద్ద దంపతులు కలెక్టర్ను ఆశ్రయించటం పలువురి మనసులు కలిచివేసింది.