. చంద్రబాబును విమర్శించే స్థాయి నానికి లేదు
. టీడీపీ ఇంచార్జీ వేగేశన నరేంద్రవర్మ
విశాలాంధ్ర ` బాపట్ల : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని బాపట్ల టీడీపీ ఇంచార్జీ వేగేశన నరేంద్రవర్మ అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఎస్సై సింగయ్యకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ వైసీపీ నేతల్లో క్రమశిక్షణ లోపించిందన్నారు. విలువలు విశ్వసనీయతకు మారుపేరైన టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించేస్థాయి కోడాలి నానికి లేదన్నారు. బూతుల మంత్రిగా నాని పేరు సంసాదించి క్యాబినెట్ స్థాయిని దిగజార్చారని అందుకే మంత్రి పదవి కూడా పోయిందన్నారు. పదవి పోయిందనే భాదలో నాని ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.సబ్యత, సంస్కారం గాలికొదిలేసి రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ స్త్రీల గురుంచి అసభ్యంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చి భిక్ష పెట్టిన కుటుంబంపై నాని అనుచితంగా వ్యాఖ్యలు చేసి నీచ సంస్కృతిని తీసుకువచ్చారన్నారు.ఢల్లీి లిక్కర్ స్కాంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు బయటకు వస్తున్న విషయం ప్రక్కదారి పట్టించడానికే అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాలని నరేంద్రవర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాత జయప్రకాష్నారాయణ, సలగల రాజశేఖర్ బాబు, పమిడి భాస్కర రావు,తానికొండ దయాబాబు, తోట నారాయణ, నక్కల వెంకటస్వామి , వడ్లమూడి వెంకటేశ్వరరావు,ముక్కముల సాంబశివరావు,ఏపూరి భూపతిరావు, పల్లం సరోజని, జిట్టా ప్రమీలరాణి, నన్నపనేని సులోచన, వేమవరపు విజయ, కట్ట సుజాత ,చెన్నుపాటి హైమావతి, రుక్మిణి,పంగులూరి శ్రీనివాసరావు,ఊట్ల రామరావు, బూర్లె రామ సుబ్బారావు , విన్నకోట వీరయ్యనాయుడు, బడుగు నాగేశ్వరరావు, ఆడే వంశి,ఐనంపూడి షాలేం రాజు, మద్దిబోయిన బుల్లియ్య , సమ్మెట నాగేంద్రరెడ్డి , పల్లం జీవన్, నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.