Friday, May 3, 2024
Friday, May 3, 2024

కనకారెడ్డి తల్లి మల్లేశ్వరిని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పరామర్శ

విశాలాంధ్ర – బాపట్ల : ఆటో ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలై చికిత్స అనంతరం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దుండి కనకారెడ్డి తల్లి మల్లేశ్వరిని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ శనివారం పరామర్శించారు. బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం గ్రామంలోని జల్లి విల్సన్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించి మల్లేశ్వరి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రామలింగం వెంకట్రావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రామలింగం రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జెలి భాగ్యశ్రీధర్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img