విశాలాంధ్ర`పెదకూరపాడు : మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీదర్ ఆదేశానుసారం శనివారం పెదకూరపాడు మండలం కన్నెగండ్ల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు అర్తిమళ్ళ రమేష్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వాలు ఆన్లైన్లో చేర్పించే విధానం గురించి తెలియజెప్పి పార్టీ కార్యకర్తలు అభిమానుల సభ్యత్వాలు అన్ని చేర్పించాలని కోరారు. బూత్ కమిటిలకు సెక్షన్ ఇన్చార్జుల నియామకం గురించి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళే విధానం గురించి గ్రామ నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెల్లంకొండ రామగోపాలరావు, డిస్ట్రిబ్యూటరీ కమిటి మాజీ చైర్మెన్ వడ్లమూడి అప్పారావు, మాజీ ఎంపీపీ గళ్ళా బాబురావు, క్లష్టర్ ఇన్చార్జ్ షేక్ అజీముల్లా, కన్నెగండ్ల సర్పంచ్ కోరంపల్లి వెంకట్రామయ్య, మాజీ సర్పంచ్ కోరంపల్లి వెంకట్రావు, మండల బీసీ నాయకులు మోదుగుల చంద్రశేఖర్, కోరంపల్లి నరేంద్ర, బూత్ కమిటి కన్వీనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.