Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నియంత పాలన నుంచి విముక్తి చేయాలి : విజయశాంతి

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని కాపాడాలని సింహవాహినీ మహంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు భాజపా నేత విజయశాంతి తెలిపారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకొస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నట్లు ఆమె అన్నారు. అమ్మవారు చాలా శక్తివంతమైనదని, ఎక్కడ చూసినా పండుగ వాతావరణ కనిపిస్తోందన్నారు. నిజమైన భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అందరూ కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. నియంత పాలనలో తెలంగాణ తల్లి నలిగిపోతోందని దీని నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి చేయాలని అమ్మవారిని కోరినట్లు విజయశాంతి చెప్పారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img