కారకస్: దేశంలో కార్మికులు చేపట్టిన ప్రదర్శనకు వ్యతిరేకంగా వెనిజులా పోలీసుల నిరం కుశ దాడిని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ గ్రీస్ (కేకేఈ) అంతర్జాతీయ సంబంధాల విభాగం ఖండిరచింది. దేశంలో చేపట్టిన ప్రజా కార్మిక ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ వెనిజులా(పీసీవీ) సంఫీుభావం తెలియజేసింది. పీఎస్యూవీ ప్రభుత్వం చేపట్టిన వేతన తగ్గింపుల విధానాలకు వ్యతిరే కంగా కారకాస్లో కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ నేపధ్యంలో పోలీసు బలగాలు కారకాస్లోని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల ప్రదర్శనలో పాల్గొన్న వెనిజులా కమ్యూనిస్టులపై దాడి చేశారు. ఈ దాడుల్లో భాగంగా కామ్రేడ్ ఏంజెల్ కాస్టిల్లోని కిడ్నాప్ చేయగా, ఈ హింసాత్మక దాడిలో వెనిజులా కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు అడెలైడా జెర్పా కూడా గాయపడ్డారు. వెనిజులా సీపీికి వ్యతిరేకంగా అణచివేతను తీవ్రతరం చేస్తున్న సంఘటనలను కేకేఈ ఖండిరచింది. వెనిజులా ప్రభుత్వం వెనిజులా సీపీికి వ్యతిరేకంగా చేపట్టిన హింసాత్మక దాడులు, కమ్యూనిజం వ్యతిరేకతను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. వెనిజులా కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ యూత్, శ్రామిక వర్గం వారి ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వారు చేస్తున్న పోరాటానికి తాము మరోసారి సంఫీుభావాన్ని తెలియజేస్తున్నామని కేకేఈ ప్రకటించింది.