పారిస్ : అఫ్గాన్ ప్రజలకు మద్దతుగా తాలిబన్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్లో భారీ ప్రదర్శన జరిగింది. అఫ్గాన్ ప్రజల కోసం మానవతా కారి డార్లను తెరవాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరారు. ప్లేస్ డి లా రిపబ్లిక్యూలో జరిగిన ర్యాలీలో 300 మందికిపైగా పాల్గొనగా ఇందులో అఫ్గాన్పౌరులు ఎక్కువగా ఉన్నారు. ‘ప్రజలను వెంటనే తరలించండి’ ‘మా కుటుంబాలను కాపాడండి’, అఫ్గాన్ జీవితాలూ ముఖ్యమే’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.