తైవాన్ : దక్షిణ ఆసియా దేశమైన తైవాన్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 46 మంది సజీవ దహనమయ్యారు. గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదంలో 41 మంది గాయపడ్డారని తైవాన్ అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజన్సీ తెలిపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 79 మందిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో 14మంది పరిస్థితి విషమంగా ఉంది. రెస్క్యూ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశముందని తెలుస్తోంది. తైవాన్లో కౌహ్నియుంగ్ నగరంలోని 13 అంతస్తుల భవనంలో ఉదయం 3గంటలకు మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో అనేక అంతస్తులు ధ్వంసమయ్యాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రక్షణ, సహాయదళాలు బాధితుల కోసం గాలిస్తున్నారు. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ అగ్ని ప్రమాద బాధితులకు తన ప్రగాఢసాంతాపాన్ని వక్తం చేశారు.