Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత విమానం

దిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్తున్న స్పైస్‌ జెట్‌ఎస్‌జీ-11 విమానం పాకిస్థాన్‌లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్‌్‌ అయ్యింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఆ సమయంలో విమానంలో 150 మందికిపైగా ప్రయాణిస్తుండగా.. వారంతా సురక్షితంగా ఉన్నారు. భారత విమానంలోని ప్రయాణికులను ట్రాన్సిట్‌ లాంజ్‌కు తరలించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లో తలెత్తిన సమస్యను ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. ఇంజినీర్లు క్లియరెన్స్‌ రిపోర్ట్‌ ఇచ్చిన తర్వాతే విమానం తిరిగి బయల్దేరనుంది. ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఇండికేటర్‌ లైట్‌ సరిగా పని చేయకపోవడంతో.. స్పైస్‌జెట్‌ విమానాన్ని కరాచీకి మళ్లించారని తెలుస్తోంది. విమానంలో కరాచీలో సురక్షితంగా దిగిందని.. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి వెల్లడిరచారు. ఎమర్జెన్సీ ఏదీ ప్రకటించలేదని.. విమానం సాధారణంగానే ల్యాండ్‌్‌ అయ్యిందని ఆయన చెప్పారు. ఇంతకు ముందు విమానంలో సమస్యలేమీ తలెత్తలేదన్నారు. విమానం లెఫ్ట్‌ ట్యాంక్‌ నుంచి అసాధారణ రీతిలో ఇంధనం తగ్గుతుండటాన్ని సిబ్బంది గమనించారని డీజీసీఏ తెలిపింది. ఇంధనం తగ్గుతూ వస్తుండటంతో కరాచీకి మళ్లించారని పేర్కొంది. విమానాన్ని తనిఖీ చేయగా.. లెఫ్ట్‌ మెయిన్‌ ట్యాంక్‌ నుంచి ఎలాంటి లీకేజీ కనిపించలేదని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img