బీజింగ్: తైవాన్ పర్యటన తర్వాత అమెరికా ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు విధించింది. తైవాన్ ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఈ పర్యటన ఉంది’’ అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే నాన్సీ పెలోసీతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా.. దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే అంశం. ఒకటే చైనా విధానాన్ని అవమానించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. వాతావరణ మార్పు, సైనిక సమస్యలు, మాదకద్రవ్యాల వ్యతిరేక పని, సరిహద్దు నేరాల నివారణపై చర్చలు వంటి ఎనిమిది నిర్దిష్ట చర్యలపై అమెరికాతో సహకారాన్ని నిలిపివేసేందుకు బీజింగ్ సంకల్పించింది. తైవాన్ జలసంధి మధ్యలో సైనిక నౌకలు,ఫైటర్ జెట్లను పంపిందని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది, చైనా`తైవాన్ల మధ్య దశాబ్దాలుగా అనధికారిక బఫర్ జోన్గా ఉంది. శుక్రవారం టోక్యోలో పెలోసిని కలిసిన జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా, తైవాన్ను లక్ష్యంగా చేసుకుని చైనా సైనిక విన్యాసాలు ప్రాంతీయ శాంతి, భద్రతకు ముప్పు కలిగించే ‘‘తీవ్ర సమస్య’’గా పేర్కొన్నారు.