వచ్చే నెలలో అమెరికా కోర్టులో కేసును వాదించనున్న రోబో
కృత్రిమ మేథస్సు (ఏఐ – ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అనేది ఇప్పుడు ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ. డ్రైవర్ లేకుండానే కారు వెళ్లడంలాంటివెన్నో దీని కిందకు వస్తాయి. ఏఐ అనేది రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించబోతోంది. ఇప్పటి వరకు మన జీవితాల్లోకి ప్రవేశించిన టెక్నాలజీ… రాబోయే రోజుల్లో ఏఐ రూపంలో మన ఇంట్లోకి కూడా ప్రవేశించబోతోంది. ఏఐ అనేది మన జీవితాలకు చాలా ప్రమాదకరం అని ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ… అది మన జీవితాల్లోకి చాలా వేగంగా వచ్చేస్తోంది. తాజాగా, వచ్చే నెలలో ఒక రోబో లాయర్ ప్రపంచంలోనే తొలిసారి కోర్టులో కేసును వాదించబోతోంది. అమెరికాలోని కోర్టులో వాదనలను వినిపించబోతోంది. డునాట్ పే అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబో న్యాయవాదిని సృష్టించింది. ట్రాఫిక్ చలానాకు సంబంధించిన కేసును ఈ రోబో వాదించబోతోంది. అయితే, ఈ కేసు విచారణ ఏ కోర్టులో జరుగబోతోందో ఆ కంపెనీ వెల్లడిరచలేదు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపినందుకు విధించిన చలానా కేసులో ఈ రోబో న్యాయవాది తన వాదనలను వినిపించనుంది.