మరణం ఎలా సంభవిస్తుంది..చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఏమవుతుంది ఇలా ఈ ప్రశ్నలు ఎప్పటికీ అంతుచిక్కకుండా ప్రశ్నలుగానే మిగిలాయి..మనిషికి మరణం తప్పదని అందరికీ తెలిసిందే. అయితే ఇకపై మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందట. ఓ ఇంజినీర్ మనిషికి త్వరలో అమరత్వం లభిస్తుందని చెప్తున్నారు. 2030 నాటికి మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందని బలంగా వాదిస్తున్నారు 75 ఏండ్ల గూగుల్ మాజీ ఇంజినీర్ రే కర్జ్వీల్. ఈయన 147 అంచనాలు వేయగా ఇందులో 86 శాతం నిజం కావటంతో ఇప్పుడు అమరత్వం వాదనకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది. జెనెటిక్స్, నానోటెక్నాలజీ, రోబోటిక్స్ తదితర అత్యాధునిక సాంకేతికతలతో మరో ఏడేండ్లలోనే మనిషికి అమరత్వం సాధ్యమవుతుందని తన యూట్యూబ్ చానల్ అడాజియోలో పోస్ట్చేసిన వీడియోలో రే వెల్లడించారు.