Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఉక్రెయిన్‌పై తీవ్రతరమవుతోన్న రష్యా దాడులు..భారతీయులకు అడ్వైజరీ జారీ చేసిన ఎంబసీ

ఉన్న పళంగా ఉక్రెయిన్‌ ని వీడాలని ఉక్రెయిన్‌ లో ఉన్న భారతీయులకు అక్కడి ఎంబసీ మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. అందుబాటులో ఏ వాహనం ఉంటే అందులో వెళ్లిపోవాలని హెచ్చరించింది.ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, భారతీయులు వెంటనే దేశం విడిచిపెట్టాలని పేర్కొంది. బోర్డర్ల దగ్గరికి చేరుకోవడానికి, బోర్డర్లు దాటేందుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్‌ లోని భారత ఎంబసీ తెలిపింది. ఈమేరకు ఈ తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఈ నెల 19న జారీ చేసిన మొదటి అడ్వైజరీలో భారతీయులు దేశం వీడేందుకు అవసరమైన మార్గాలను సూచించింది. ఉక్రెయిన్‌- హంగేరి, ఉక్రెయిన్‌- స్లోవేకియా, ఉక్రెయిన్‌- మాల్డోవా, ఉక్రెయిన్‌- పోలాండ్‌, ఉక్రెయిన్‌- రొమేనియా సరిహద్దుల నుంచి దేశం దాటొచ్చని పేర్కొంది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img