ఏథెన్స్: సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వోలోస్లో కేకేఈ భారీ ప్రదర్శన చేపట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రీస్ (కేకేఈ) నిర్వహించిన పెద్ద రాజకీయ కార్యక్రమంలో వేలాది మంది కేకేఈ సభ్యులు, స్నేహితులు, కార్మికులు, యువకులు, మహిళలు, బ్యానర్లు, జెండాలు పట్టుకొని సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలు చేస్తూ, నగరంలోని సెంట్రల్ ప్రామినేడ్కు తరలి వచ్చారు. సెంట్రల్ గ్రీస్లోని సముద్రతీర గ్రామమైన నీస్లో కమ్యూనిస్ట్ యూత్ ఆఫ్ గ్రీస్ (కేఎన్ఈ) 31వ సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రదర్శనను భారీ ఎత్తున చేపట్టింది. కేఎన్ఈతో సన్నిహిత సోదర సంబంధాలను కొనసాగించే కమ్యూనిస్ట్ పార్టీల జనరల్ సెక్రటరీలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ స్పెయిన్ (పీసీటీఈ) జనరల్ సెక్రటరీ ఆస్టర్ గార్సియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మెక్సికో (పీసీఎమ్), టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ) జనరల్ సెక్రటరీ కెమెన్ ఒకుయాన్ సామ్రాజ్యవాద యుద్ధానికి వ్యతిరేకంగా తమ పార్టీల ఉమ్మడి పోరాటానికి ముగ్గురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కేకేఈ జనరల్ సెక్రటరీ డిమిత్రిస్ కౌట్సౌంబాస్ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న ఎనిమిది మంది కమ్యూనిస్ట్ యువకుల ప్రతినిధులు ర్యాలీకి హాజరయ్యారు. ఈవెంట్ ముగింపులో ‘‘ఇంటర్నేషనల్’’ పాట పాడారు, తద్వారా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, శ్రామికవర్గ అంతర్జాతీయవాదానికి శక్తివంతమైన సందేశాన్ని పంపారు.