Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

దాసన్నపేటలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

విశాలాంధ్ర, విజయనగరం టౌన్ : దాసన్నపేటలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ఎన్నికల ప్రచారాన్ని సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి కామేశ్వరరావు తో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా పి.కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశం,రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇందులో భాగంగా విజయనగరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శీను తో పాటు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం ప్రజలంతా చూస్తున్నారన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన అన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి చేశారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులను తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. కావున రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, తాతారావు, రామకృష్ణ, నవీన్ ,చంద్ర రావు, నరసింహులు,వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img