పశ్చిమ దేశాలకు రష్యా హెచ్చరిక: అణ్వాయుధాల విధానంలో మార్పు
మాస్కో: తమపై దాడులు చేసే దేశాలకు దీటైన బదులు ఇచ్చేందుకు అణ్వస్త్రాలు వినియోగించాలని రష్యా నిర్ణయించింది. ఇదే విషయమై పశ్చిమ దేశాలకు ఓ హెచ్చరిక చేసింది. తాజా నిర్ణయానికి అనుకూలంగా అణ్వాయుధాల విధానంలో మార్పులు చేసింది. దీని ప్రకారం వైమానిక దాడులు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లతో తమపై దాడులు చేస్తేగనుక అణ్వస్త్రాలు వినియోగించాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా భద్రతా మండలి సమావేశంలో స్పష్టంచేశారు. అణ్వస్త్రాలు లేని దేశం చేసే దాడికి మద్దతిస్తే రెండు దేశాలు కలిసి చేసినట్లుగానే పరిగణించి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. తమపై దాడికి యత్నిస్తున్న దేశానికి అణుశక్తి కలిగిన దేశం సహకరిస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పుతిన్ అన్నారు. శత్రు దేశానికి సహాయం చేసే పశ్చిమ దేశాలను కట్టడి చేసే ఉద్దేశంతోనే అణ్వస్త్రాల విధానంలో మార్పులు చేసినట్లు వెల్లడిరచింది. అణ్వాయుధాలతోనే కాకుండా ఇతర మార్గాల్లోనూ తమపై దాడులు చేస్తే జరిగే పరిణామాల గురించి ఆ దేశాలకు ఇదొక హెచ్చరిక అవుతుందని క్రెమ్లిన్ తెలిపింది. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విధానంలో మార్పులు చేశామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ తెలిపారు. అయితే అణ్వాయుధాలు పెంచుకొనే ఉద్దేశం లేదన్నారు.