Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈనెల 14 నుండి 30వ తేదీ వరకు మోడీ హటావో – దేశ్ బచావో పేరుతో ప్రచారభేరి.. గోడ పత్రిక విడుదల

జగ్గయ్యపేట: ఈనెల 14 నుండి 30వ తేదీ వరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ,సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మోడీ హటావో – దేశ్ బచావో పేరుతో ప్రచారభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,ఎన్ టి ఆర్ జిల్లా డిప్యూటీ సెక్రటరీ దోనేపూడి శంకర్ తెలిపారు. బుధవారం జగ్గయ్యపేట లో సిపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు ఆయన జగ్గయ్యపేట వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సీపీఐ నాయకులతో కలిసి ఆయన ప్రచార భేరి కి సంభందించిన గోడ పత్రిక ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ నిరంకుశ ధోరణి తో వ్యవహరిస్తోందనిదుయ్యబట్టారు.దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందనిమండిపడ్డారు.ప్రజల్లో కు లతత్వాన్ని, మతోన్మాదాన్నిరెచ్చగొడుతోందనివిమర్శించారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యం చేసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు 14వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రచార బేరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15వ తేదీన జగ్గయ్యపేటలో నిర్వహించే ప్రచార బేరిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారని, ప్రజలుపెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ సహాయ కార్యదర్శి అంబోజి శివాజీ, పట్టణ కార్యదర్శి జూనబోయిన శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి మా శెట్టి రమేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు లంకా గోవిందరాజులు, భాను,సీపీఐ సీనియర్ నాయకులు భోగ్యం నాగులు,మెటికల శ్రీనివాసరావు,సిపిఎం నాయకులు కాకన బోయిన లింగా రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img