విశాలాంధ్ర - గూడూరు: మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి పూలమాలలు వేసి నివాళులర్పించిన గూడూరు వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు తలుపులు వెంకట కృష్ణారావు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. పూలే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో గొర్రె పత్తి రవికుమార్, మాగంటి నాగరాజు యాదవ్,యక్కల నాగరాజు, ఎండి కరిముల్లా, పోతన సుధాకర్, అట్లూరి వెంకటేశ్వరరావు, బత్తిన నాగ త్రినాథ్, తలుపులు పని, పావురాల ఆంజనేయులు, వేమూరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.