Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేవాలయం, చర్చిలు, మసీదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

రెడ్డిగూడెం : మండల పరిధిలోని అన్ని దేవాలయాలలో చర్చిలు, మసీదులలో సీసీ కెమెరాలు తప్పని సరిగా అమర్చుకోవాలని రెడ్డిగూడెం ఎస్సై డి. అనంద్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఎస్సై తన సిబ్బందితోకలసి జిల్లా ఎస్పీ సిద్దార్ద్‌ కౌశిల్‌ మరియు నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు ఆదేశాల మేరకు సీఐ పి. శ్రీను పర్యవేక్షణలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న దేవాలయాలు అయన పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటానికి ఆలయకమిటీ మరియు గ్రామస్తులు సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించారు. ఇప్పటికేకొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు గ్రామాల్లోని ప్రధాన కూడళ్ళలో కూడా ఆయా గ్రామస్థుల, దాతల సహకారంతో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే దేవాలయాల్లో హుండిలోని కానుకలను ఎప్పటికప్పుడుతీయాలని ఆయన ఆలయ కమిటీ వారికి సూచించారు. ఈకార్యక్రమంలో సిబ్బందిపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img