గుడివాడ : గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడివాడ
మోటూరు, మండవల్లి రైల్వే స్టేషన్ల మధ్య 45/5-6 వద్ద గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాల మధ్య వయసుగల వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మరణించినట్లు రైల్వే ఎస్.ఐ కె.నాగశ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు మృతుడు తెలుపు, నలుపు, రంగు గల టిషర్టు, నలుపు రంగులో ఫ్యాంటు ధరించి ఉన్నాట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు రైల్వే సబ్ ఇన్స్పెక్టర్కి తెలియజేయలని తన ప్రకటనలో కోరారు.