- గర్భగుడిలో మూలవిరాట్ ఫొటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన వైనం
- దుర్గగుడి ఇన్ స్టాగ్రామ్ ఖాతాలోనే పోస్ట్ చేయడంపై భక్తుల విస్మయం
- పోలీసులకు దుర్గగుడి అధికారులు ఫిర్యాదు
విశాలాంధ్ర- విజయవాడ వన్ టౌన్ : ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో తీవ్ర అపచారం జరిగింది. ఎన్నడూ లేనివిధంగా గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్ ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.