Friday, April 26, 2024
Friday, April 26, 2024

విజయవంతంగా ముగిసిన సభ్యత్వ నమోదు ప్రక్రియ

సబ్యత్వ కమిటీ సభ్యులను అభినందించిన రాష్ట్ర, జాతీయ నాయకులు

విశాలాంధ్ర- మైలవరం:ఎన్టీఆర్ జిల్లా APUWJ సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా సభ్యత్వ కమిటీ సభ్యులు సభ్యత్వ నమోదు పుస్తకాలను ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు,APUWJ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి చందూ జనార్దన్ చేతుల మీదుగా జిల్లా కన్వీనర్ యు.వెంకట్రావుకు అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర,జాతీయ నాయకులు సభ్యత్వ కమిటీ సభ్యుల పని తీరును అభినందించారు.రాష్ట్రంలో ఏకైక అతి పెద్ద యూనియన్ అయిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ లో సభ్యత్వాన్ని పొందిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.జర్నలిస్టులకు సంబందించి హెల్త్ కార్డ్స్,హెల్త్ ఇన్స్యూరెన్స్, అక్రిడిటేషన్లు, ఇళ్ళ స్థలాలు సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు నాయకులు వెల్లడించారు.ముఖ్యం గా జర్నలిస్ట్ లు హెల్త్ ఇన్సూరెన్స్ నమోదు పై ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల పరిధిలో దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ వెంకట్రావ్ తో పాటు సభ్యత్వ కమిటీ సభ్యులు రాజేష్,వర ప్రసాద్,చిట్టిబాబు,నాగరాజు,అసదుల్లా,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఖాజా మొహిద్దిన్,ఐజేయు మాజీ సభ్యులు సైదేస్వరారావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img