విశాలాంధ్ర` పెద్దకడబూరు : వైసీపీ ప్రభుత్వం తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సంక్షేమ పథకాల ప్రధాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరువ వద్దని కోరారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చ్కెర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి,రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్,రామాంజనేయులు, ఎంపీటీసీ సభ్యులు మల్లేష్, గజేంద్ర రెడ్డి, శివరామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, విజయేంద్ర రెడ్డి, రామలింగప్ప, ఉరుకుందప్ప,ముక్కరన్న, అర్లప్ప, ఎంపీడీఓ వెంకట రమణప్ప, తాసిల్దార్ వీరేంద్ర గౌడ్, వ్యవసాయ అధికారి వరప్రసాద్, ఏఈ లు మల్లయ్య, వేణు గోపాల్, నాగవేంద్రం, సాయికుమార్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.