విశాలాంధ్ర`నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో కుమ్మరి వీధి 24 వ వార్డులో కౌన్సిలర్ చాంద్ భాషా ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి కమిషనర్ కిషోర్తో కలిసి భూమి పూజ చేసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో నందికొట్కూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నందికొట్కూరు ప్రజలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం అధికారులతో కలిసి వార్డులో పర్యటించి సమస్యలపై ఆరా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ భాను ప్రతాప్, కౌన్సిలర్ అల్లూరి కృష్ణ, వైసిపి నాయకులు కురువ శీను, బ్రహ్మయ్య, రమేష్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.