Friday, April 26, 2024
Friday, April 26, 2024

కామ్రేడ్ జింకల తిమ్మప్ప ఆశయాలు కొనసాగిద్దాం

విశాలాంధ్ర -శెట్టూరు : సిపిఐ సీనియర్ నాయకులు మాజీ మండల కార్యదర్శి, మాజీ జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ జింకల తిమ్మప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో భౌతికయాన్ని సందర్శించి పూలమాలు ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప మాట్లాడుతూ దాదాపు 50 సంవత్సరాలపాటు సిపిఐ పార్టీ సభ్యునిగా జిల్లా కౌన్సిల్ సభ్యులుగా మండల కార్యదర్శిగా పనిచేశారన్నారు అదేవిధంగా పేద ప్రజల కోసం ఎల్లవేళల తపన చేసిన వ్యక్తి తిమ్మప్ప అన్నారు ప్రజా సమస్యల పైన పార్టీ ఇచ్చే పిలుపులపైన స్పందించే వారన్నారు ఇలాంటి వ్యక్తి పార్టీకి దూరం కావడం చాలా బాధాకరమైన అదే విధంగా తిమ్మప్పలేని లోటు పార్టీకి చాలా నష్టమన్నారు వీరి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామని నా కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహులు, నియోజకవర్గ సహాయ కార్యదర్శి మహాదేవ్, విశాలాంధ్ర బుక్ హౌస్ మాజీ మేనేజర్ చెట్ల ఈరన్న, మండల కార్యదర్శి జయరాములు,సీనప్ప, డాక్టర్ జయరాములు, బొచ్చుపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img