Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేజీబీవీలో ప్రవేశాలకు ధరఖాస్తు ఆహ్వానం

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని కస్తూరి బా గాంధీ గురుకుల విద్యాలయంలో 6వ తరగతికి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయినట్లు కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిణి చైతన్య స్రవంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవీలో 6వ తరగతిలోను , ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 40 సీట్లు చొప్పున, 8వ తరగతిలో 3 సీట్లు,9వ తరగతిలో 4 సీట్లకు ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనాథ పిల్లలు, బడిబయట పిల్లలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బిపిఎల్ బాలికలు మాత్రమే ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అన్నారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 20 వ తేదీ వరకు aజూసస్త్రపఙ. aజూషటంం. ఱఅ అనే వెబ్సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు విద్యాలయం ప్రత్యేక అధికారిణి గానీ, జీసీడీఓ 9000204936 నెంబరును సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img