Friday, April 26, 2024
Friday, April 26, 2024

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి

విశాలాంధ్ర -ఆస్పరి : గ్రామీణ క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎస్సై వరప్రసాద్ అన్నారు. బుధవారం సంక్రాంతి పండుగ మరియు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణ ప్రైమ్ స్కూల్ అధ్వర్యంలో కబడ్డీ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముందుగా ఎస్ఐ వరప్రసాద్ ను కరస్పాండెంట్ నరేష్ ఆచారి శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ ప్రైమ్ స్కూల్ అకడమిక్ డీన్ సతీష్ కుమార్, ఉపాధ్యయులు అరుణ, జోష్ణ, రమ, రేష్మ, గౌశియ, నారాయణ, రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు రవి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img