Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టీడీపీ సంబరాలు విడ్డూరం

విశాలాంధ్ర- పెద్దకడబూరు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాలను గెలిచినట్లుగా టిడిపి నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం పెద్దకడబూరులో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 13న రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికలు జరిగితే 11 స్థానాలలో వైసీపీ విజయం సాధించిన విషయాన్ని టిడిపి నాయకులు గుర్తించుకోవాలని హితవు పలికారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటులో వైసీపీ లీడులో ఉందని, రెండవ ప్రాధాన్యత ఓటుతో టిడిపి విజయం సాధించిన విషయాన్ని టిడిపి మరువకూడదన్నారు. మూడు స్థానాలతో ఒరిగిందేమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, వైసీపీ నాయకులు రవిచంద్రా రెడ్డి, ముక్కరన్న, బ్రహ్మయ్య, అర్లప్ప, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img