విశాలాంధ్ర`ఆస్పరి : ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగు రైతు రక్షణ కాలి నడక పాదయాత్రలను విజయవంతం చేయాలని మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కాలినడక యాత్ర వాల్ పోస్టర్లను సిపిఐ, ఏపీ రైతు సంఘం నాయకులు విడుదల చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి మాట్లాడుతూ అధిక వర్షాలు, నకిలీ పత్తి విత్తనాలు వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 40 వేలు రూపాయలు మరియు ఉల్లి, మిరప, ఉద్యాన పంటలు వేసిన నష్టపోయిన రైతులకు ఎకరాకు 60 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 16 నుండి ఆదోని లో ప్రారంభమవుతున్న రైతు రక్షణ కాలి నడక పాదయాత్రలో మండల ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, డిసెంబర్ 20వ తేదీ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు మహాధర్న లో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు మహానంది, ఆంజనేయ, సంజప్ప, ఏఐఎస్ఎఫ్ నాయకులు రేవంత్, కుమార్, రంగస్వామిలు పాల్గొన్నారు.