Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నారా లోకేష్‌ యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దాం

టిడిపి కన్వీనర్‌ పరమారెడ్డి

విశాలాంధ్ర-ఆస్పరి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌ జనవరి 27న చేపట్టే యువగళం కార్యక్రమం పాదయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టిడిపి మండల కన్వీనర్‌ పరమారెడ్డి పిలుపునిచ్చారు. ఆలూరు టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుకు వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత టిడిపి ప్రభుత్వ హాయంలో నిరుద్యోగులకు అండగా ఉండేందుకు నిరుద్యోగ భృతి ఇచ్చేవారని, ప్రస్తుతం నిరుద్యోగ భృతిని తుంగలో తొక్కారని విమర్శించారు. యువతకు  అండగా నిలబడాలన్న ఉద్దేశంతో యువత హక్కులు సమస్యలపై పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు జనవరి 27 నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ డైరెక్టర్‌ కృష్ణ యాదవ్‌, మాజీ చైర్మన్‌ నౌనేపాటి చౌదరి, మాజీ కన్వీనర్‌ శ్రీనివాసులు గౌడ్‌, మాజీ డైరెక్టర్‌ సంజన్న, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ముత్యాల రెడ్డి, ఎంపీటీసీ రహంతుల్లా, కార్యదర్శి శేషాద్రి, ఉపాధ్యక్షుడు సుదర్శన్‌, సహాయ కార్యదర్శి రాజశేఖర్‌, టీడీపీ యువ నాయకుడు కె. సతీష్‌ కుమార్‌, యూత్‌ కన్వీనర్‌ రాఘవేంద్ర, గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరేష్‌, తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు మారెష్‌, నరేష్‌, నాగేంద్ర, రాజు, ఆలూరు ఐటీడీపీ కార్యదర్శి తలారి రామాంజినేయులు, టీడీపి నాయకులు మహానంది, మలేశప్ప,నాగన్న, మహబూబ్‌, అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img