Friday, April 26, 2024
Friday, April 26, 2024

జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..

విశాలాంధ్ర /ఆస్పరి : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆస్పరి యూత్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను మేజర్ పంచాయతీ సర్పంచ్ మూలింటి రాధమ్మ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కేడిసిసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, జడ్పిటిసి దొరబాబు, మాజీ కన్వీనర్ రామాంజనేయులు సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, యూత్ నాయకులు మసాలా ప్రకాష్ లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు చాలామంది ఉన్నారని, వారి క్రీడ అభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివద్ధికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఉత్తేజం, ఉత్సాహం, పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ అశోక్, విద్యా కమిటీ చైర్మన్ వీరేష్ ,అక్బర్, మా భాష, సందీప్, రాము, సంజన్న, మహానంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img