Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

సీపీఐ పార్టీ పిలుపు
విశాలాంధ్ర-నల్లమాడ : ఈనెల 5వ తేది రాష్ట్రవ్యాప్తంగా జగనున్న జగనన్న కాలనీలకు రూ 1,80,000ల కాకుండా రూ 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ పార్టీ పిలుపు నిచ్చారు. గురువారం మండల కేంద్రము లోని ఎంఈఓ కార్యాలయం ఎదుట విలేకరులు సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి అంజినేయులు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన స్థానిక తాశీల్దార్‌ కార్యాలయం ఎదుట, నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఏపి ముఖ్యమంత్రి జగన్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇండ్ల పేరుతో ఇస్తున్నటువంటి పక్కా గృహాలు ఇంటి నిర్మాణానికి రూ 1,80,000 మాత్రమే సరిపోదని దీంతో చాలామంది లబ్ధి దారులు ఇంటి నిర్మాణాలు చేపట్టలేక పోతున్నార న్నారు. కావున ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా మన్నారు . విపరీతమైనటువంటి ధరలు ఆకాశంలో ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సిమెంట్‌, ఇసుక ధరలు కడ్డీ ధరలు గాని బాత్రూం పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోదని ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. పేద ప్రజలు ఇంటికళ నెరవేరాలంటే కచ్చితంగా నిర్మాణాన్ని వ్యయం పెంచాలని సీపీఐ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని హెచ్చరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఐ పార్టీ తరపున తహశీల్దార్‌ కార్యాలయాలలో ప్రభుత్వం వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చంద్ర , కార్యదర్శి రమణ, సహాయ కార్యదర్శి పూజారి వెంకటరమణ, ఓడిచెరువు మండల కార్యదర్శి చలపతినాయుడు, రత్న బాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img