Friday, April 26, 2024
Friday, April 26, 2024

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మౌళిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్మిక శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో వెంకట రమణప్ప అధ్యక్షతన మండల అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి వసతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే గ్రామాలలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, హౌసింగ్ ఏఈ వేణుగోపాల్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img